నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 16 ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని తంబళ్లపల్లె పసుపు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ సుమిత్ర సూచించారు. సోమవారం ఆమె మండల పశువైద్యాధికారి విక్రంరెడ్డి తో కలిసి ఎద్దులవారి పల్లి పంచాయతీ గౌడసానిపల్లెలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈనెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు మండలంలోని 9500 పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకమే కాకుండా పశువుల ఉత్పాదకతను గణనీయంగా దెబ్బతీయడం జరుగుతుందన్నారు. కావున పాడి రైతులు తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో గడ్డి కత్తిరించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని రైతులు సంబంధిత పశువైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News