నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 04 :: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 19వ వార్డు సచివాలయం వద్ద నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో స్థానిక ప్రజలు, సిపిఎం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు..198 జీవో ప్రకారము మున్సిపాలిటీ పరిధిలో ఉండే గృహాలకు ప్రతి ఏడాది పన్నులు పెంచుతూ పేద ప్రజలకు భారంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే 198 జీవోను వెంటనే రద్దుపరచాలని అలాగే పెంచిన పన్నులను తగ్గించాలని, ఏడాదిలో నూట యాభై రోజులు పేదలకు పనులు కల్పించాలని కోరుతూ నిరసన తెలిపారు.. నిరసన అనంతరం సచివాలయంలో సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు
Reporter
Namitha News