Sunday, 13 September 2026 07:59:14 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వినూత్న జీవనోపాదులతో ఆర్థిక అభివృద్ధికి శ్రీకారం -డిపిఎం గంగార్జున

Date : 19 May 2026 09:22 PM Views : 294

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 19 : మహిళా సంఘాలు భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధికి వినూత్న జీవనోపాదులతో అడుగులు వేసి శ్రీకారం చుట్టాలని డిపిఎం గంగార్జున పిలుపునిచ్చారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జీవనోపాదులపై శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా గంగార్జున మాట్లాడుతూ మహిళలు దీర్ఘకాలిక ఆదాయ వనరులైన వెదురు పెంపకం, మునగ ఆకు పెంపకం, విస్తరాకులు తయారీ, టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ల నిర్వహణపై ముందుకు రావాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఆర్జించే పై జీవనోపాదులపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ నూతన జీవనోపాదుల నిర్వహణ పైలెట్ ప్రాజెక్టుగా వీరబల్లి, రాయచోటి, తంబళ్లపల్లె ఎంపిక చేసి పై పథకాలు అమలు చేయడానికి సహకరించాలన్నారు. 35 సెంట్లు వెదురు సాగు తో ఏడాదికి 40వేల నుండి లక్ష వరకు ఆదాయం, ఎకరం మునగ ఆకు సాగుతో లక్ష నుండి రెండు లక్షల వరకు ఆదాయం, టమోటా ధర నిలకడ లేని సమయంలో ప్రాసెసింగ్ యూనిట్లో వాటిని సాస్, ఊరగాయ, పౌడర్ ఉత్పత్తులతో ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. తంబళ్లపల్లె లోని మల్లయ్య కొండ, సాదుకొండల్లో దొరికే ముడి సరుకుతో జీవనోపాధి మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఈ విషయమై రిసోర్స్ పర్సన్ లు కుసుమ, బామర్ది లు జీవనోపాదులపై వీడియో రూపంలో సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అంజనప్ప, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, సీసీలు రమణ, కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి మహిళా సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :