నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 09 : కోరిన కోర్కెలు తీర్చే శ్రీ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు. మదనపల్లె పట్టణం సిటిఎం రోడ్డు శీవాజీ నగర్ వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా, పూజలు,, జపాలు, హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, శివాజీ నగర్, చీకలగుట్ట ప్రజల ఆత్మీయ ఆహ్వానం మేరకు మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డీ సాహెబ్ ను ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వేదపండితులు ఆశీర్వదించి, తీర్ధప్రసాదాలు అందజేసినారు. ఆలయ నిర్మాణంలో రెడ్డీ సాహెబ్ ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం మరువలేనిదని వారు కొనియాడారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ భక్తుల నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా శ్రీ పోలేరమ్మ తల్లి నిలుస్తుందని, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు మహబూబ్ పీర్, శరత్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ద్వారకనాథ్ రెడ్డి, ఎస్కే రెడ్డప్ప, ఇస్మాయిల్ గంగరాజు, గురు భాస్కర్, అశోక, నాగరాజు వెంకటేష్ తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Admin
Namitha News