Wednesday, 29 July 2026 11:13:49 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు

Date : 19 April 2026 06:13 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు బోధిసత్వ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన శీలవంతమైన మార్గంలో యువత నడవాలని, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) యువజన విభాగం నేతలు పిలుపునిచ్చారు. "యువత - నైతికత" అన్న అంశంపై ఆదివారం ప్రెస్ క్లబ్ లో, బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్బంగా జరిగిన విలేకర్ల సమావేశంలో బాస్ యువజన విభాగం నాయకులు బైనేని సురేష్, నీరుగట్టి రాజేష్, పి. పృద్విరాజ్, చాట్ల కళ్యాణ్, ఆర్. మహేంద్ర, కె. తేజ, ఎస్. ఈశ్వర్ లు మాట్లాడుతూ యువతను సరైన మార్గంలో నడిపించే స్పష్టమైన కార్యక్రమం ఏదీ ప్రభుత్వం వద్ద లేకపోవడం వల్ల, యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత నైతికతతో పునీతమైతే దేశం ఘననీయమైన పురోగతిని సాధిస్తుందని అభిప్రాయ పడ్డారు. యువతలో నైతికతను పెంపొందించడానికి వారికి అంబేడ్కర్ ను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత అంబేడ్కర్ మార్గంలో నడిపిస్తే, దేశంలో గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. యువతను చైతన్య పరిచి, అంబేడ్కర్ మార్గంలో నడిపించడానికి, బాస్ యువజన విభాగం కృషి చేస్తుందని తెలిపారు. బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి ముందస్తు వేడుకలు విజయవంతం చేసిన బాస్ కుటుంబ సభ్యులకు, అంబేడ్కర్ అభిమానులకు వీరు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి పోతబోలు రెడ్డెప్ప, బాస్ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్, ఉద్యోగ సంఘ నాయకులు చిట్టిబాబు, చిన్నప్పలతో పాటు బాస్ నాయకులు నీరుగట్టి రమణ, గంపల రమణ, సొన్నికంటి రెడ్డెప్ప, డేగాని రమణ, వై. గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, కృష్ణ, జనార్దన్, శశిధర్, ప్రశాంత్, తరుణ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :