Sunday, 13 September 2026 02:48:07 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఉపాధ్యాయుల ఆకలి కేకలు

ఉపాధ్యాయుల శిక్షణ లో ఆకలి కేకలు

Date : 06 June 2026 10:31 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూన్ 06 : రాయచోటి మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న FLN ఉపాధ్యాయ శిక్షణలో తీవ్ర అవ్యవస్థలు నెలకొన్నాయి. సుమారు 600 మంది ఉపాధ్యాయులు హాజరవుతుండగా, వారికి సరిపడా భోజనం, తాగునీరు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు నుంచే టీ, స్నాక్స్ లేకుండా శిక్షణ నిర్వహించగా, మధ్యాహ్న భోజనం కూడా అందరికీ సరిపోక వందలాది మంది ఉపాధ్యాయులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. రెండో రోజూ ఇదే పరిస్థితి కొనసాగడంతో అసంతృప్తి మరింత పెరిగింది. ఒక్కో ఉపాధ్యాయుడిపై భోజనం, టిఫిన్, స్నాక్స్ కోసం ₹300, స్టేషనరీ కోసం ₹100 కేటాయించినప్పటికీ, నాసిరకం ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండ తీవ్రతలో సరిపడా తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ వంటి కీలక కార్యక్రమాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరమని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :