Thursday, 30 July 2026 01:09:10 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఉపాధ్యాయుల ఆకలి కేకలు

ఉపాధ్యాయుల శిక్షణ లో ఆకలి కేకలు

Date : 06 June 2026 10:31 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూన్ 06 : రాయచోటి మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న FLN ఉపాధ్యాయ శిక్షణలో తీవ్ర అవ్యవస్థలు నెలకొన్నాయి. సుమారు 600 మంది ఉపాధ్యాయులు హాజరవుతుండగా, వారికి సరిపడా భోజనం, తాగునీరు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు నుంచే టీ, స్నాక్స్ లేకుండా శిక్షణ నిర్వహించగా, మధ్యాహ్న భోజనం కూడా అందరికీ సరిపోక వందలాది మంది ఉపాధ్యాయులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. రెండో రోజూ ఇదే పరిస్థితి కొనసాగడంతో అసంతృప్తి మరింత పెరిగింది. ఒక్కో ఉపాధ్యాయుడిపై భోజనం, టిఫిన్, స్నాక్స్ కోసం ₹300, స్టేషనరీ కోసం ₹100 కేటాయించినప్పటికీ, నాసిరకం ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండ తీవ్రతలో సరిపడా తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ వంటి కీలక కార్యక్రమాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరమని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :