నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 07 : పుంగనూరు పట్టణంలోని భగత్సింగ్ కాలనీలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వారం పాటు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఆదివారం అప్పర్ ప్రైమరీ స్కూల్లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. గంగాధర్ నాయుడు ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ శరవణ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రమాదాల సమయంలో ఎలా రక్షించుకోవాలి వంటి విషయాలు ఈ శిబిరం ద్వారా స్పష్టంగా నేర్చుకున్నామని తెలిపారు. ఫైర్ సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. శిబిరం తమలో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బి. చెంగయ్య, బి. బాలరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News