నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 25 : ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు.. కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించి అనంతరం కార్యాలయ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు... ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ పేద ప్రజలు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఇల్లు నిర్మించే పరిస్థితి లేకపోతే ఉన్న ఇంటికి అద్దె చెల్లించండి అని వీరు డిమాండ్ చేశారు.అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు
Reporter
Namitha News