Thursday, 30 July 2026 01:35:11 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇండియన్ బ్యాంక్ కు మహిళా సంఘాలదే కీలక పాత్ర - బ్రాంచ్ మేనేజర్ ఎస్.ఎం.డి. మంజూర్ ఇలాహి

Date : 02 June 2026 10:30 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 02 : తంబళ్లపల్లె మండలంలోని వెలుగు మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎస్ ఎం డి మంజూర్ ఇలాహి ప్రశంసించారు. మంగళవారం ఆయన వెలుగు కార్యాలయంలో ఏటీఎం గంగాధర్ తో కలిసి సీసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ ద్వారా మండలంలోని 36 గ్రామ సమాఖ్యలు, 18 వివోలు, 450 కి పైగా మహిళా సంఘాలకు గత ఏడాది రూ 50 కోట్లకు పైగా సిఐఎఫ్ రుణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అదేవిధంగా శ్రీనిధి, ముద్ర, పీఎం ఈజిపి, చేనేత కార్మికులకు సైతం రుణ సౌకర్యం కల్పించామని అదే విధంగా రైతులకు పంట రుణాలు, పాడి ఆవులు, గొర్రెలు, మినీ వ్యాపారాలు పలు రకాల విభిన్న వ్యాపారాలపై రుణాలు అందించామని చెప్పారు. భవిష్యత్తులో ఇదే తంతు కొనసాగించి వెలుగు సంఘ సభ్యుల సహకారంతో మరిన్ని రుణాలు అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ఇండియన్ బ్యాంక్ ఇస్తున్న సహకారం మరువరానిదని కొనియాడారు. మహా మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదికి మహిళా సంఘాల కు విభిన్న వ్యాపారాల కోసం రెండు సౌకర్యం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. వారి వెంట సీసీలు కత్తి నరసింహులు, రమణ, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మ, వేట మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :