నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం: బీజేపీ నేతల ధ్వజం మదనపల్లి స్థానిక బిజెపి కార్యాలయం నందు బీజేపీ నాయకుడు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం తన ప్యాలెస్కే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. కేవలం 10 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ను వాడుతున్నారంటే ఆయన ప్రజలను కలవడానికి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో లిక్కర్, ల్యాండ్ మరియు ఇతర రంగాల్లో భారీగా అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధి కేవలం కూటమితోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 5000 దేవాలయాలను పునర్నిర్మిస్తామని, టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, స్థానిక నాయకులు కేవలం తమ సొంత లాభాల కోసమే పనిచేశారని ఆయన మండిపడ్డారు
Reporter
Namitha News