Monday, 08 June 2026 08:29:30 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం: బీజేపీ నేతల ధ్వజం

Date : 27 January 2026 03:42 PM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం: బీజేపీ నేతల ధ్వజం మదనపల్లి స్థానిక బిజెపి కార్యాలయం నందు బీజేపీ నాయకుడు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం తన ప్యాలెస్‌కే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. కేవలం 10 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్‌ను వాడుతున్నారంటే ఆయన ప్రజలను కలవడానికి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో లిక్కర్, ల్యాండ్ మరియు ఇతర రంగాల్లో భారీగా అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధి కేవలం కూటమితోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 5000 దేవాలయాలను పునర్నిర్మిస్తామని, టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, స్థానిక నాయకులు కేవలం తమ సొంత లాభాల కోసమే పనిచేశారని ఆయన మండిపడ్డారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :