Saturday, 12 September 2026 04:40:19 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ?

అధిష్టానం నుండి పిలుపు తో తంబళ్లపల్లె లో సంబరాలు

Date : 28 February 2026 09:17 PM Views : 417

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఎంపిక ఖరారు అయినట్లు అధిష్టానం నుండి సంకేతాలు అందాయి. శనివారం తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల లోని టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లి విరిసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన మండల స్థాయి నాయకులతోపాటు కార్యకర్తలు తమ పనులు జరగక పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, జిల్లా, ఇంచార్జ్ మంత్రులకు నాయకులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. జయచంద్ర రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ కావడం తో అధిష్టానం ఇన్చార్జి ఎంపికపై ఆచితూచి అడుగులు వేసింది. చివరకు తంబళ్లపల్లె ప్రజల నాడి తెలిసిన మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకత్వంపై మొగ్గు చూపినట్లు తెలిసింది. శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ ను ఎంపిక చేస్తూ ఆదివారం రాజధానికి రమ్మని పిలుపు అందింది. మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తో పాటు ఆరు మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీలక నాయకులకు పిలుపు వచ్చింది. తంబళ్లపల్లె నుండి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరిశ్రీనివాసులుతో ఆరు మండలాల నాయకులు అమరావతికి తరలి వెళ్లారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :