నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఎంపిక ఖరారు అయినట్లు అధిష్టానం నుండి సంకేతాలు అందాయి. శనివారం తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల లోని టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లి విరిసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన మండల స్థాయి నాయకులతోపాటు కార్యకర్తలు తమ పనులు జరగక పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, జిల్లా, ఇంచార్జ్ మంత్రులకు నాయకులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. జయచంద్ర రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ కావడం తో అధిష్టానం ఇన్చార్జి ఎంపికపై ఆచితూచి అడుగులు వేసింది. చివరకు తంబళ్లపల్లె ప్రజల నాడి తెలిసిన మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకత్వంపై మొగ్గు చూపినట్లు తెలిసింది. శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ ను ఎంపిక చేస్తూ ఆదివారం రాజధానికి రమ్మని పిలుపు అందింది. మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తో పాటు ఆరు మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీలక నాయకులకు పిలుపు వచ్చింది. తంబళ్లపల్లె నుండి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరిశ్రీనివాసులుతో ఆరు మండలాల నాయకులు అమరావతికి తరలి వెళ్లారు.
Reporter
Namitha News