Monday, 02 March 2026 06:50:49 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ?

అధిష్టానం నుండి పిలుపు తో తంబళ్లపల్లె లో సంబరాలు

Date : 28 February 2026 09:17 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఎంపిక ఖరారు అయినట్లు అధిష్టానం నుండి సంకేతాలు అందాయి. శనివారం తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల లోని టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లి విరిసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన మండల స్థాయి నాయకులతోపాటు కార్యకర్తలు తమ పనులు జరగక పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, జిల్లా, ఇంచార్జ్ మంత్రులకు నాయకులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. జయచంద్ర రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ కావడం తో అధిష్టానం ఇన్చార్జి ఎంపికపై ఆచితూచి అడుగులు వేసింది. చివరకు తంబళ్లపల్లె ప్రజల నాడి తెలిసిన మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకత్వంపై మొగ్గు చూపినట్లు తెలిసింది. శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ ను ఎంపిక చేస్తూ ఆదివారం రాజధానికి రమ్మని పిలుపు అందింది. మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తో పాటు ఆరు మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీలక నాయకులకు పిలుపు వచ్చింది. తంబళ్లపల్లె నుండి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరిశ్రీనివాసులుతో ఆరు మండలాల నాయకులు అమరావతికి తరలి వెళ్లారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :