నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 09 : తంబళ్లపల్లె పంచాయతీ వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు రసాభసా గా మారి ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేలం పాటలు ప్రారంభించగా హాజరైన సభ్యులు పంచాయతీలో వారపు సంత ఎక్కడ నిర్వహిస్తున్నారో ప్రకటించాలని, మూడు చోట్ల వారసంత నిర్వహణ లేకుండా చూడాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన వారపు సంత నిర్వాహకులు పంచాయతీకి బకాయిలు ఉన్నారని వాటి లెక్క తేల్చాలని నిలదీశారు. కనీసం బస్టాండ్ గేటు వేలం పాటలు నిర్వహించడానికి కార్యదర్శి ప్రయత్నించగా సభలో గందరగోళం నెలకొనడంతో విధులేని పరిస్థితిలో మరో మారు వారపు సంత వేలం పాటలు వాయిదా వేస్తూ తదుపరి వేలం పాటల తేదీ ఖరారు చేస్తామని ప్రకటించడంతో సభ్యులు శాంతించారు. తంబళ్లపల్లెలో ప్రస్తుతం పాత బస్టాండ్ వద్ద శనివారం, సోమవారం గంగమ్మ గుడి వద్ద సాయంత్రం క్రాస్ రోడ్ లో9 సంతలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ సంతల నిర్వహణ అయోమయంగా మారడం ట్రాఫిక్ సమస్య, వాహన రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. వారపు సంతకు పాత హై స్కూల్ వెనుక ప్రభుత్వం కేటాయించిన ఎకరం స్థలం లో సంత నిర్వహణకు అధికారులు చొరవ చూపించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. వెంటనే వారపుసంతను పాత ఐటిఐ గ్రౌండ్లో తాత్కాలికంగా నిర్వహించి తదుపరి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అభివృద్ధి చేసి సంతను అక్కడకు మార్చితే తంబళ్లపల్లె మధ్యలో సంత ఉండి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. గంగమ్మ గుడి వద్ద ఉన్న వారపు సంత పరసతోపు పంచాయతీకి చెందినది కాబట్టి అక్కడ సంత నిర్వహణకు ఏర్పాట్లు చేసి అదే విధంగా గొర్రెల సంతకు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇటు తంబళ్లపల్లి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజల అభిప్రాయపడుతున్నారు. సంబంధిత రెండు పంచాయతీల కార్యదర్శిలు, మండల స్థాయి అధికారులు చొరవచూపి రెండో సంచులు అభివృద్ధి చెంది పంచాయతీల ఆదాయం పెరగడానికి కృషి చేయాల్సి ఉంది
Reporter
Namitha News