Monday, 08 June 2026 09:56:25 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

రోడ్డు ఆక్రమణలు తొలగించకుండా ట్రాఫిక్ నిబంధనలు ఎవరి మెప్పు కోసం

ప్రజలను ఇబ్బందులకు గురించేసే ట్రాఫిక్ నిబంధనలు రద్దు చెయ్యాలి, ఆర్టీసీ బస్సులను యధాతతంగా నడపాలి సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

Date : 05 February 2026 09:28 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 05 : మదనపల్లె పట్టణంలో రోడ్డు ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని సిపిఎంతో సహా అన్ని సంఘాలు అడుగుతున్నా పట్టించుకోకుండా ట్రాఫిక్ క్రమంబద్దీకరణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే విపరీతమైన వాహన రద్దీ, ప్రజల రాకపోకలతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి రోడ్లు వెడల్పు చేసి, ట్రాఫిక్ సిగ్నల్లు రోడ్డు డివైడర్లు ఏర్పాటు చెయ్యడం ద్వారా సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే, ట్రాఫిక్ సమస్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ పి లకు కనిపించకుండా చెయ్యడం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయ్యటాన్ని తప్పు పట్టారు. పట్టణంలోని రోడ్లు పూర్తిగా ఆక్రమణకు గురైన ఫలితంగా ట్రాఫిక్ ఆటంకాలు తీవ్రంగా ఉన్నాయని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు అలాంటిది ఆదిలారులకు ఎందుకు కనబలేదని ప్రశ్నించారు. అధికారులు చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వలన విద్యార్థులు, రైతులు, కూలీలు, ఉద్యోగం, ఉపాధ్యాయులు, ఆసుపత్రులకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న రోడ్లు అన్నీ ఆక్రమణలు పాల్పడ్డారని, రోడ్డు ఆక్రమించుకోవడమే కాకుండా, వాళ్ళ బిల్డింగ్‌ల ముందు చిన్న తోపుడు బండ్లు, బంకులు పెట్టింది, వారి వద్ద వేల రూపాయలు బాడుగలు (అద్దెలు) వసూలు చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెనువెంటనే ఈ రోడ్ల ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఉన్న వారపుసంతను టమాట మార్కెట్ యార్డుకు, మార్కెట్ యార్డును పట్టణ బయటకు తరలించాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అభివృద్ధి చెయ్యాలని, ఫుట్ పాత్ ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రజలు, వాహనదారులు అందరికీ ట్రాఫిక్ అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిపిఎం ఉద్యమం చేస్తుందని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :