నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీటర్ రాక్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రజలు జీవించాలని సందేశం - గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు పిలుపు మదనపల్లి పట్టణం,బాలాజీ నగర్ పీటర్ రాక్ చర్చి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగిందని గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు తెలిపారు.ఇందులో భాగంగా క్రిస్మస్ పండుగను పురస్క రించుకొని పేదలకు బట్టలు పంపిణీ చేయడం,పాస్టర్లకు శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగింది.అదే విధంగా గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బోనాసి జాన్ బాబు మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ అనేది క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించుకునే ముందస్తు వేడుక అన్నారు.ఇందులో ప్రజలతోపాటు ఇతరులతో కలిసి సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు.డిసెంబర్ 25 వ తేదీన క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను గొప్పగా,సంతోషంగా జరుపు కుంటారన్నారు.ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు దయ,కరుణ కలిగి జీవించాలని సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ దివాకర్,పాస్టర్ మనై,పాస్టర్ పోలయ్య,పాస్టర్ శ్యామేలు,సిస్టర్ నిర్మల,శోభ,శ్యామల,ప్రమీల పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.
Reporter
Namitha News