నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 27 : ఆత్మకూరు విద్యుత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేసిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ విద్యుత్ సిబ్బంది..ఇటీవల గ్రేడ్ 2 సిబ్బందిని జూనియర్ లైన్మెన్ గా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించి కొందరు కోర్టుకు వెళ్లిన నెపంతో తిరిగి ఆ విధానాన్ని రద్దు పరిచే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఈ నిరసన చేపట్టారు. తిరిగి ఈ సిబ్బందిని విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ లుగా కొనసాగించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియపరిచారు.. అనంతరం విద్యుత్ శాఖ ఆత్మకూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్, ఏడిఈ చిన్న స్వామి నాయక్ లకు వినతి పత్రం అందించారు.. వీరి వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు.. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎటియు రాష్ట్ర నాయకులు శివప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హజరత్ మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ కార్యదర్శి S విజయరామిరెడ్డి, అధ్యక్షులు ch. ఓంకార్, మహేష్ రెడ్డి, నరసింహరెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News