Tuesday, 15 September 2026 09:55:58 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ఎన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

Date : 27 May 2026 07:31 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 27 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు చిత్తూరులో మే 17 నుండి మే 26, 2026 వరకు నిర్వహించిన ఎన్‌సీసీ ఏటీసీ-III శిబిరంలో విశిష్ట ప్రతిభ కనబర్చారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ . సి. యువరాజ్ తెలిపారు. దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఫైరింగ్ శిక్షణ, అడ్డంకుల శిక్షణ, మ్యాప్ రీడింగ్, యుద్ధ నైపుణ్యాలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫైరింగ్ శిక్షణ ద్వారా ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించగా, అడ్డంకుల శిక్షణ ద్వారా శారీరక సామర్థ్యాన్ని పెంపొందించారు. మ్యాప్ రీడింగ్ కార్యక్రమంలో ప్రదేశాల గుర్తింపు, దిశా నిర్ధారణ వంటి నైపుణ్యాలను నేర్పించారు. మొత్తం 594 మంది క్యాడెట్లు పాల్గొన్న ఈ శిబిరంలో క్రమశిక్షణ, సమయపాలన మరియు జట్టు భావనలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన మిట్స్ యూనివర్సిటీకి చెందిన 15 మంది క్యాడెట్లు తదుపరి శిబిరానికి ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. ఈ శిబిరానికి కమాండింగ్ ఆఫీసర్‌గా కల్నల్ ఎన్‌వి మోనిస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ సేవలందించగా, చిత్తూర్ 35 (A) ఆంధ్ర బెటాలియన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిబిరంలో ప్రతిభ కనబర్చిన ఎన్‌సీసీ క్యాడెట్లను మిట్స్ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ మరియు ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ అభినందించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :