నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 24 : అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన, ఎవరు చేసిన వదిలిపెట్టకూడదని మదనపల్లె డిఎస్పీ పావని పోలీసులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్, రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు . ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు అన్సర్బాషా, రమణ, సిబ్బంది కి పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి పట్ల అభిమానం చూపి , వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే యువత మత్తుకు,ఆన్లైన్ బెట్టింగ్లకు భానిసలు కాకుండ చూడాలన్నారు. అలాగే ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించి, పట్టణ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు
Reporter
Namitha News