Wednesday, 29 July 2026 01:34:37 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సంక్రాంత్రి కి ఊరు వెళ్తున్నారా... మీ ఇంటి భద్రతలపై మా సూచనలు పాటించండి, అప్రమత్తంగా ఉండండి

మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచనలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 10 January 2026 11:05 AM Views : 309

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 10 : సంక్రాంతి పండుగ వేళ ప్రజలు తమ ఇంటి భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలను చైతన్య పరచడానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పండుగ సెలవుల్లో ఇళ్లను వదిలి వెళ్ళే వారు పాటించవలసిన కీలక భద్రతా సూచనలను ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలియచేసారు. ప్రజల కోసం ఎస్పీ గారి కీలక సూచనలు ఇంటి తలుపులకు, బాల్కనీలకు నాణ్యమైన తాళాలు వాడండి. గేట్లకు బయట నుంచి కాకుండా, లోపలి వైపు తాళం వేయడం వల్ల మీరు ఇంట్లో లేరనే విషయం బయటి వారికి తెలియకుండా ఉంటుంది. ఇంట్లో భారీ నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దు. వాటిని బ్యాంక్ లాకర్లలో లేదా నమ్మకస్థులైన బంధువుల వద్ద ఉంచడం క్షేమకరం. ఇంటి పరిసరాల్లో హై-రిజల్యూషన్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. వీటిని మీ మొబైల్ ఫోన్‌కు అనుసంధానించడం ద్వారా ఎక్కడి నుంచైనా మీ ఇంటిని పర్యవేక్షించవచ్చు. ఊరెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం ఇవ్వాలి. దీనివల్ల గస్తీని ముమ్మరం చేసే వీలుంటుంది. మీరు లేని సమయంలో మీ ఇంటి పరిసరాలపై కన్నేసి ఉంచమని నమ్మకమైన పొరుగువారికి చెప్పండి. ఇంటి ముందు వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోమని కోరండి. ప్రయాణ వివరాలు, లైవ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దొంగలకు సులభంగా సమాచారం అందుతుంది. పండుగ ముగిసి ఇంటికి చేరిన తర్వాతే ఫోటోలను షేర్ చేయండి. రాత్రి వేళల్లో ఇంటి ఆవరణ, గ్యారేజ్ ప్రాంతాలు వెలుగుతో ఉండేలా చూడండి. చీకటి దొంగలకు అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు మరియు కాలనీల్లో పోలీస్ వాహనాల ద్వారా మైకుల ద్వారా విశృతంగా ప్రజలకు అవగాహనా కల్పిస్తూ రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. మైకుల ద్వారా అవగాహన కల్పిస్తూనే, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ మరియు బీట్ కానిస్టేబుళ్ల తనిఖీలను మరింత పటిష్టం చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు ఫోటో తీసి డయల్ 112 లేదా స్తానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించాలి. "మీ భద్రత మా బాధ్యత, కానీ మీ జాగ్రత్త మాకు అదనపు బలం. పోలీసుల సూచనలు పాటించి, నేరరహిత సమాజానికి సహకరిస్తూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి" అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకాంక్షించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :