నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 04 : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పురస్కరించుకుని ఆదివారం రోజున పట్టణం లోని అమ్మచెర్వు మిట్ట వద్ద ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తూ , కరపత్రాలు పంపిణీ చేస్తూ రింగ్ రోడ్డు సర్కిల్ లో రాంగ్ డైరెక్షన్ లో వచ్చే వాళ్లకు అలా వస్తే ప్రమాదం జరిగే విధానం ను వివరించి మళ్లీ ఇలా రాంగ్ డైరెక్షన్ లో వచ్చి ప్రమాదాలకు కారకులు కాకండి అని హెచ్చరించిన రవాణా శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News