నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 30 : తంబళ్లపల్లె మండలంలోని రేణుమాకులపల్లి పంచాయతీ కేంద్రం లో మసీదు తో పాటు ఉర్దూ పాఠశాల సమీపంలోని తాగునీటి బోరు వద్ద నీటి వృధా అవుతున్నా ఎవరు పట్టించుకోలేదని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు నిజాముద్దీన్ తోబాటు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి వృధాతోపాటు అక్కడ దుర్గంధం ఏర్పడి దోమలు ప్రభలుతున్నాయని వెంటనే పంచాయతీ అధికారులు తాగునీటి బోరు మరమ్మతులు చేపట్టి నీటి వృధా కాకుండా పారిశుధ్యం కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News