నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం -- రూ.2.80 లక్షల విలువ గల ఫర్నీచర్ వితరణ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, ఐడిబిఐ బ్యాంక్ గురువారం భారీ సాయం అందించింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంకు మేనేజర్ వేలాయన్, ఫీల్డ్ ఆఫీసర్ నారాయణ, అముల్ కుమార్ తదితరులు సిఎస్ఆర్ నిధులతో రూ. 2.80 లక్షల విలువైన ఫర్నిచర్ ను ఆస్పత్రికి సాయంగా అందజేశారు. 10 వీల్ ఛైర్స్, 5 స్ట్రెచర్లు, 5 త్రీ సీటర్ బెంచ్ లు, 4 ఇన్వర్టర్ బ్యాటరీస్, 10 ఫాన్ లను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, ఆర్ఎంఓ షుకూర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐడిబీఐ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్ మాట్లాడుతూ పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో తమవంతు బాధ్యతగా రోగులకు ఉపయోగకరంగా ఉండే ఫర్నీచర్ ను అందజేయడం జరిగిందన్నారు. వీటిని పేద రోగుల సౌకర్యం వినియోగించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంకు నిర్వాహకులు పెద్దమనసుతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు ఉపయోగపడే ఫర్నిచర్ వితరణ గా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో ఆస్పత్రిలో కొంత మేర పర్నీచర్ కొరత తీరిందన్నారు. పేదరోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐడిబీఐ బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఫోటో రైటప్ ప్రభుత్వ ఆసుపత్రికి ఐడిబీఐ బ్యాంకు వితరణగా అందించిన ఫర్నీచర్
Reporter
Namitha News