Monday, 08 June 2026 08:30:45 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

సర్వజన ఆసుపత్రి కి ఐడిబిఐ బ్యాంక్ వితరణ

రూ .2.80 లక్షల విలువ గల ఫర్నీచర్ వితరణ

Date : 08 January 2026 06:57 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం -- రూ.2.80 లక్షల విలువ గల ఫర్నీచర్ వితరణ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, ఐడిబిఐ బ్యాంక్ గురువారం భారీ సాయం అందించింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంకు మేనేజర్ వేలాయన్, ఫీల్డ్ ఆఫీసర్ నారాయణ, అముల్ కుమార్ తదితరులు సిఎస్ఆర్ నిధులతో రూ. 2.80 లక్షల విలువైన ఫర్నిచర్ ను ఆస్పత్రికి సాయంగా అందజేశారు. 10 వీల్ ఛైర్స్, 5 స్ట్రెచర్లు, 5 త్రీ సీటర్ బెంచ్ లు, 4 ఇన్వర్టర్ బ్యాటరీస్, 10 ఫాన్ లను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, ఆర్ఎంఓ షుకూర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐడిబీఐ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్ మాట్లాడుతూ పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో తమ‌వంతు బాధ్యతగా రోగులకు ఉపయోగకరంగా ఉండే ఫర్నీచర్ ను అందజేయడం జరిగిందన్నారు. వీటిని పేద రోగుల సౌకర్యం వినియోగించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంకు నిర్వాహకులు పెద్దమనసుతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు ఉపయోగపడే ఫర్నిచర్ వితరణ గా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో ఆస్పత్రిలో కొంత మేర పర్నీచర్ కొరత తీరిందన్నారు. పేదరోగులకు మెరుగైన‌ వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐడిబీఐ బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఫోటో రైటప్ ప్రభుత్వ ఆసుపత్రికి ఐడిబీఐ బ్యాంకు వితరణగా అందించిన ఫర్నీచర్

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :