Thursday, 30 July 2026 10:27:35 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సర్వజన ఆసుపత్రి కి ఐడిబిఐ బ్యాంక్ వితరణ

రూ .2.80 లక్షల విలువ గల ఫర్నీచర్ వితరణ

Date : 08 January 2026 06:57 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం -- రూ.2.80 లక్షల విలువ గల ఫర్నీచర్ వితరణ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, ఐడిబిఐ బ్యాంక్ గురువారం భారీ సాయం అందించింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంకు మేనేజర్ వేలాయన్, ఫీల్డ్ ఆఫీసర్ నారాయణ, అముల్ కుమార్ తదితరులు సిఎస్ఆర్ నిధులతో రూ. 2.80 లక్షల విలువైన ఫర్నిచర్ ను ఆస్పత్రికి సాయంగా అందజేశారు. 10 వీల్ ఛైర్స్, 5 స్ట్రెచర్లు, 5 త్రీ సీటర్ బెంచ్ లు, 4 ఇన్వర్టర్ బ్యాటరీస్, 10 ఫాన్ లను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, ఆర్ఎంఓ షుకూర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐడిబీఐ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్ మాట్లాడుతూ పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో తమ‌వంతు బాధ్యతగా రోగులకు ఉపయోగకరంగా ఉండే ఫర్నీచర్ ను అందజేయడం జరిగిందన్నారు. వీటిని పేద రోగుల సౌకర్యం వినియోగించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంకు నిర్వాహకులు పెద్దమనసుతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు ఉపయోగపడే ఫర్నిచర్ వితరణ గా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో ఆస్పత్రిలో కొంత మేర పర్నీచర్ కొరత తీరిందన్నారు. పేదరోగులకు మెరుగైన‌ వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐడిబీఐ బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఫోటో రైటప్ ప్రభుత్వ ఆసుపత్రికి ఐడిబీఐ బ్యాంకు వితరణగా అందించిన ఫర్నీచర్

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :