నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 10 : తంబళ్లపల్లి మండలంలోని జంజర పెంట పంచాయతీ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పెద్దేరు ప్రాజెక్టు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పెద్దేరు ప్రాజెక్ట్ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో రోడ్డు గుంతల మయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా తయారైంది. ఈఏడాది పెద్దేరు ప్రాజెక్టు నిండడంతో నిత్యం వందలాదిమంది పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వాహనాలలో వస్తున్నారు. రోడ్డు సౌకర్యంతో పాటు పార్కు మరమ్మతులు చేపట్టకపోవడంపై పర్యాటకులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెద్దేరు ప్రాజెక్టు కు రోడ్డు సౌకర్యంతో పాటు పార్క్ మరమ్మతులు చేపడితే పర్యాటకుల సంఖ్య పెరిగి మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News