నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 02 : అన్నమయ్య జిల్లా కేంద్రం గా నున్న రాయచోటి ని రద్దు చేస్తూ మదనపల్లె మార్పు చేస్తూ గెజిట్ విడుదల చేసి ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆవేదనను దృష్టిలో పెట్టుకుని, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి రెండు రోజులుగా సీనియర్ న్యాయవాదులతో సంప్రదించి, 30 పేజీల డ్రాఫ్ట్ తో పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు, జిల్లా కేంద్రం నిర్ణయ ప్రక్రియలో రాయచోటి ప్రజల అభిప్రాయాలను సేకరించలేదని, నోటిఫికేషన్లో వారి ప్రస్తావన కూడా లేదని, రాయచోటి ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చివరి వరకు కొనసాగించి, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Admin
Namitha News