Tuesday, 15 September 2026 09:51:11 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

దళితులపై దౌర్జన్యం,కులం పేరుతో దూషణలు, భౌతిక దాడులు, పోలీసులకు ఫిర్యాదు

Date : 30 December 2025 05:50 PM Views : 295

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - డిసెంబర్ 30: దళితులపై దాడి,న్యాయ పోరాటానికి మద్దతు తెలిపిన బహుజన సేన - రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు మండల కేంద్రమైన కురబలకోట లో కుల వివక్ష, దౌర్జన్యం చోటుచేసుకున్నాయి. ఎస్సీ కాలనీకి వెళ్లే దారిని అడ్డుకోవడమే కాకుండా, ప్రశ్నించిన దళిత ఆటో డ్రైవర్‌పై కులం పేరుతో దూషణలకు దిగి భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు మదనపల్లి సబ్ డివిజనల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ​ఘటన వివరాలు: కురబలకోట ఎస్సీ కాలనీకి చెందిన A. గంగాధర్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈ నెల 28వ తేదీ రాత్రి పని ముగించుకుని తన ఆటోలో ఇంటికి వెళ్తుండగా, స్థానిక బస్టాండ్ పక్కన ఉన్న పొడవు అబ్దుల్ అనే వ్యక్తి పెద్ద పెద్ద బండరాళ్లను దారికి అడ్డుగా వేశాడు. ఆటో వెళ్లడానికి వీలు లేకపోవడంతో గంగాధర్ దీనిపై ప్రశ్నించగా, అబ్దుల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ​కులం పేరుతో దూషణలు - భౌతిక దాడి: "మీ మాదిగ పల్లెవాళ్ళు నా ఇంటి ముందు నుంచి వెళ్లకూడదు" అంటూ అబ్దుల్ బాధితుడిని అత్యంత అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించాడు. దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించే ప్రయత్నం చేయగా, గంగాధర్‌ను కిందకు తోసేసి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గంగాధర్ బావమరిది శివ, స్థానికుడు శ్రీనివాసులు అడ్డుకోబోగా.. అబ్దుల్ కుమారుడు ఉమర్ కూడా వారితో కలిసి గొడవకు దిగాడు. బాధితులను పిడిగుద్దులతో కొట్టడమే కాకుండా, తాము ఆరాధించే దేవుళ్లను ఉద్దేశించి కూడా అసభ్యంగా మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ​చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి: గత ఆరు నెలలుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, ఆ దారి గుండా వస్తే "నరుకుతాం" అని నిందితులు బహిరంగంగా బెదిరిస్తున్నారని గంగాధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ కాలనీకి వెళ్లే ప్రధాన దారిని అడ్డుకుంటూ, దళితులపై నిరంతరం దౌర్జన్యానికి పాల్పడుతున్న పొడవు అబ్దుల్ మరియు అతని కుమారుడు ఉమర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను డిమాండ్ చేశాడు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :