నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్ట్ 04 ః తంబళ్లపల్లె గిరిజన గురుకుల విద్యాలయం అసౌకర్యాల తో కొట్టుమిట్టాడుతుండేది. గతంలో పాలకుల నిర్లక్ష్యంతో గిరిజన విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఈ మధ్య ఉన్నతాధికారులతోపాటు తాసిల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, కార్యదర్శి శ్రీనివాసరావు లు గురుకుల సమస్యలను తంబళ్లపల్లె ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి గిరిజన విద్యార్థుల సౌకర్యాల కల్పనలో తీవ్రంగా స్పందించారు. వెంటనే గురుకుల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించగా గురుకులంలోని మినిరల్ వాటర్ ప్లాంట్,బాత్ రూం లు, కుళాయిల మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు విద్యతోబాటు నాణ్యమైన భోజనం ఇతర సౌకర్యాలు చకచకా జరిగిపోయాయి. ఈ కార్యక్రమాల నిర్వహణకు స్కూల్ కమిటీ చైర్మన్ మనిగే రాజన్న, హెడ్మాస్టర్ తో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, నాగరాజు, పిల్లల తల్లిదండ్రులు సహకరించారు.
Reporter
Namitha News