నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 10 : తంబళ్లపల్లె మండలం లో గురువారం వ్యవసాయ అధికారులు వేరుశనగ పంట కోత ప్రయోగం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్, వ్యవసాయ సహాయ సంచాలకులు శివశంకర్, మండల వ్యవసాయ అధికారి రమణ కుమార్ ల ఆధ్వర్యంలో ఎద్దుల వారి పల్లి పంచాయతీ రైతు రెడ్డప్ప పొలంలో వేరుశనగ పంట కోత ప్రయోగం జరిగింది. వేరుశనగ పొలంలో 5X5 మీటర్లు పంటలో6.600 కిలోల దిగుబడి రావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ మాట్లాడుతూ ఖరీఫ్ వేరుశనగ పంటలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ ఉలవలు బీడు భూముల్లో పంట సాగు చేసి లబ్ధి పొందాలని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో నూనె ఉత్పత్తి పంటలపై దృష్టి సారించాలని తక్కువ నీరు, విద్యుత్తు ఆదాతో ఎక్కువ దిగుబడి సాధించాలని సూచించారు. రైతులు భవిష్యత్తులో సేంద్రీయ ఎరువుల వ్యవసాయం తో లాభసాటి దిగుబడి సాధ్యమని తెలిపారు. వారి వెంట ఆర్ బి కే ఏఈఓ లు సురేష్, అంబేద్కర్, జయరాం, మల్లీశ్వరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News