నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : మదనపల్లి - డిసెంబర్ 17 : తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సుగవాసి ప్రసాద్ బాబును పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగు తమ్ముళ్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సుబ్రహ్మణ్యం రాజు మనోజ్ సందీప్ శాలువాతో సన్మానించి, హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో పుంగనూరు ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు ఆయనను కోరారు. అలాగే పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై సుగవాసి ప్రసాద్ బాబుకు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన, పుంగనూరు అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇచ్చారని భరోసా కల్పించారని వారు తెలియజేశారు. త్వరలోనే పుంగనూరుకు వచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, జంపాల మోహన్ నాయుడు, గంగ రాజు, మనోజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News