Saturday, 12 September 2026 04:42:03 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి

Date : 19 June 2026 08:29 AM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 18 ః తంబళ్లపల్లి మండలంలోని పరసతోపు పంచాయతీ మొండివారిపల్లిలో పూర్వం నుండి నిరుపేద మైనార్టీ, బిసి కుటుంబాలు ఉండి రహదారి ఆ సమస్య ఉండేది. కొన్నాళ్ల క్రితం రెవిన్యూ అధికారులు గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేశారు. రహదారి గత వర్షాలకు గుంతల మయమైంది. ఈ రహదారిని కొందరు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే మీ దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పడంతో నిస్సహాయులైన ఆ మైనార్టీ కుటుంబాలు విధిలేక తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణికి మైనారిటీ పురుషులు, మహిళలు మూకుమ్మడిగా తమ గోడు ఫిర్యాదుల రూపంలో వెళ్లబోసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేక రాకపోకలు, కనీస అవసరాలతో పాటు అంబులెన్స్ రావడానికి వీలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని అధికారులు స్పందించాలని మొరపెట్టుకున్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు రహదారి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వగా ఎంపీడీవో ఉషారాణి రహదారి సమస్య పరిష్కారమైతే రోడ్డు నిర్మాణానికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి ఆ నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :