నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 18 ః తంబళ్లపల్లి మండలంలోని పరసతోపు పంచాయతీ మొండివారిపల్లిలో పూర్వం నుండి నిరుపేద మైనార్టీ, బిసి కుటుంబాలు ఉండి రహదారి ఆ సమస్య ఉండేది. కొన్నాళ్ల క్రితం రెవిన్యూ అధికారులు గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేశారు. రహదారి గత వర్షాలకు గుంతల మయమైంది. ఈ రహదారిని కొందరు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే మీ దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పడంతో నిస్సహాయులైన ఆ మైనార్టీ కుటుంబాలు విధిలేక తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణికి మైనారిటీ పురుషులు, మహిళలు మూకుమ్మడిగా తమ గోడు ఫిర్యాదుల రూపంలో వెళ్లబోసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేక రాకపోకలు, కనీస అవసరాలతో పాటు అంబులెన్స్ రావడానికి వీలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని అధికారులు స్పందించాలని మొరపెట్టుకున్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు రహదారి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వగా ఎంపీడీవో ఉషారాణి రహదారి సమస్య పరిష్కారమైతే రోడ్డు నిర్మాణానికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి ఆ నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది
Reporter
Namitha News