నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 ః తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ పరిధిలోని ఇరిగేషన్ గుండ్లపల్లి పెద్ద చెరువు మరమ్మత్తు పనులు చెరువు సంఘం అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నట్లు మండల జనసేన పార్టీ నాయకుడు సిద్ధమల్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ఏఈ సతీష్ సూచనలు ఆయకట్టు కమిటీ మెంబర్లు, కూటమి నేతలు, ఆయకట్టు రైతులు పెద్ద అప్పల్ల, కాలా నారాయణ,పెద్ద వీరభద్ర, జైపాల్ నాయుడు, ఈశ్వర్ రెడ్డి, మధు నాయుడు, శివారెడ్డి, చంద్రమోహన్, జగడం అనిల్, షేక్ హసిన్, రోహిత్ కుమార్ ,రెడ్డప్ప నాయుడు సలహాల మేరకు చెరువుకట్ట పై కంప చెట్ల తొలగింపు, కట్ట బలోపేతం తో పాటు చెరువు మొరువతో పాటు ప్రధాన కాలువల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు
Reporter
Namitha News