Wednesday, 29 July 2026 04:54:09 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

భార్యను వేదించిన కేసు లో సంవత్సరం రోజులు జైలు శిక్ష

మహిళను వేధించినందుకు భర్త, అత్త, మామ లకు జైలు శిక్ష -తంబళ్లపల్లె కోర్టు సంచలనాత్మక తీర్పు

Date : 07 May 2026 09:12 PM Views : 305

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : మహిళలను వేధిస్తే శిక్షలు తప్పవ ని తంబళ్లపల్లె కోర్టు తీర్పు నిదర్శనంగా నిలిచింది. మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన అంజలి ని తనకల్లు మండలం ఈ తోడు గ్రామం రెడ్డి శేఖర్ తో వివాహమైంది. ఆమెను భర్త రెడ్డి శేఖర్ తోపాటు మామ రామచంద్ర, అత్త యశోదమ్మలు తరచూ వేధించేవారు. ఈ విషయమై అంజలి వేధింపులు తాళలేక పుట్టింటికి చేరి తన భర్త, అత్తమాములపై 2018 లో తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లో వేధింపుల పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు నినదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ అంజలి పై వేధింపులు జరిగినట్లు రుజువు కావడంతో భర్త రెడ్డి శేఖర్ కు ఆరు మాసాల సాధారణ శిక్ష తోపాటు రూ1000 రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో మరో 15 రోజుల సాధారణ శిక్ష, రామచంద్ర కు మూడు నెలల సాధారణ శిక్ష తో పాటు రూ 1000 జరిమానా, చెల్లించని పక్షంలో 15 రోజులు సాధారణ శిక్ష, యశోదమ్మకు మూడు నెలల సాధారణ శిక్ష తో పాటు రూ 1000 రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో 15 రోజుల సాధారణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అనంతరం నిందితులను తంబళ్లపల్లె పోలీసులు మదనపల్లి సబ్ జైలుకు తరలించారు.ఈ వేధింపుల కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరాంజనేయులు తమ వాదనలు వినిపించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :