Sunday, 13 September 2026 05:49:51 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం ఔరా–2కె26

ముఖ్య అతిధిగా కోయంబత్తూరు కు చెందిన గేట్వేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ & సి.ఈ.ఓ. సబరినాథన్ ముత్తు పాల్గొన్నారు

Date : 27 February 2026 07:41 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 27 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం “ఔరా–2కె26” కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కోయంబత్తూరు కు చెందిన ఫౌండర్ & సి ఈ ఓ సబరినాథన్ ముత్తు, గేట్వేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పరిమితమైన అంశం కాదని, ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ యాప్‌ల నుంచి ఆరోగ్య, బ్యాంకింగ్, రవాణా సేవల వరకు ఏఐ ప్రభావం విస్తరించి ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును ఏ రంగంలోనైనా సమర్థవంతంగా వినియోగిస్తే ఆ రంగం యొక్క ఉత్పాదకత మరియు నాణ్యత రెట్టింపు అవుతాయని తెలిపారు. విద్య నుంచి వైద్యం, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ఇప్పుడు ఏఐ ప్రమేయం లేని రంగం దాదాపుగా లేదని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ సాంకేతిక విద్యార్థుల మధ్య సాంకేతిక ఆవిష్కరణలు, సహకార అభ్యాసం మరియు ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉధ్యేశం అని అన్నారు. విద్యార్థులు జనరేటివ్ ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐ ఆధారిత పరిశోధనలలో నూతన ఆవిష్కరణలు చేయాలని, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ఏఐ భవిష్యత్తులో ముఖ్య పాత్ర పోషితుంది అని తెలిపారు. కార్యక్రమంలో ఆధునిక సాంకేతిక సెషన్‌లు, పేపర్ ప్రెజెంటేషన్‌లు, ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు మరియు జనరేటివ్ ఏఐ ఆధారిత పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్స్ డాక్టర్ కే.హేమలత, డాక్టర్ చొక్కనాథన్, పి.రఘురామన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :