నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పాడి రైతుల సహకారంతో శ్రీజ పాల డైరీ అత్యధిక పాల సేకరణతో ముందడుగు వేసినట్లు శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప తెలిపారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె వెలుగు ఏపిఎం గంగాధర్ తో కలిసి పలు శ్రీజ డైరీ లను తనిఖీ చేసి పాల సేకరణ పై రికార్డులు పరిశీలించి సంతృప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీజ పాల డైరీ చెందిన కురబలకోట డైరీలో 7000 లీటర్లు, బి కొత్తకోట 6300 లీటర్లు, తంబళ్లపల్లె 6000 లీటర్లు, ముదివేడు 4,500 లీటర్లు, రెడ్డి కోట 3600 లీటర్లు, కోసువారిపల్లి 3300 లీటర్లు, పీటీఎం 3050 లీటర్లు సామర్థ్యంతో ఏడాది 20 శాతం ఉత్పత్తి సాధించి పాడి రైతులకు లీటరు ధర రూ 36 నుండి రూ 48.50 వరకు చెల్లించడంతోపాటు ప్రతి ఏడాది రైతులకు బోనస్ రూపంలో లీటరుకు 16 పైసలు చొప్పున మొత్తం 18 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. పాడి రైతుల సంక్షేమం కోసం సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ తో పాటు పాడిపశువుల వైద్యం కోసం అనునిత్యం మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రత్యేక వైద్య నిపుణులచే సలహాలు సూచనలతో రైతు సంక్షేమం కోసం శ్రీజ డైరీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు
Reporter
Namitha News