నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 04 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం జనసేన నాయకులు శనివారం జనసేన మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి రాందాస్ చౌదరిని ఆయన నివాసంలో శాలువ కప్పి పుష్ప గుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి ప్రకటించిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ కు మండల జనసేన పార్టీ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులుగా మీకు పదవి రావాలని మండల జనసేన కార్యకర్తలు,డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నామని రాందాస్ చౌదరి కి తెలిపారు. ఈ సమావేశం లో పాల్గొన్నా ఎం జి పి వినోద్, కళ్యాణ్ ఎస్ వి ఆర్ బాలాజీ, సిఖిందర్, చంటి, చంద్రహాసన్, అశోక్, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News