Wednesday, 29 July 2026 10:22:54 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మైనర్ బాలిక పై అసత్య ప్రచారం పై యస్.ఐ. ఆగ్రహం

తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

Date : 29 November 2025 06:40 PM Views : 258

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ​రామసముద్రం - నవంబర్ 29 : రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక అదృశ్యం కేసు దర్యాప్తు విషయంలో కొందరు వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, వాస్తవాల వక్రీకరణను పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇది ఫోక్స చట్టం పరిధిలోకి వచ్చే సున్నితమైన అంశం, దర్యాప్తుకు ఆటంకం కలిగించినా, తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని రామసముద్రం పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో స్పష్టం చేశారు. ​కేసు వివరాలు, నిందితుడి కుటుంబ సభ్యుల వైఖరి ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ​17 సంవత్సరాల మాధవి అనే మైనర్ బాలిక నవంబర్ 15, 2025న మణి అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ​నవంబర్ 17న తల్లి ఫిర్యాదు మేరకు క్రైమ్ నం. 111/2025 కింద కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు. ​అయితే, సంఘటన జరిగిన వెంటనే అనుమానిత వ్యక్తి మణి తల్లిదండ్రులు, సోదరుడు పరారీలోకి వెళ్లిపోయారు. వారు నివాసం మార్చడం, సమాచారం దాచడం వంటి చర్యలతో దర్యాప్తుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించినా, ఇప్పటివరకు వారు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ప్రేమ జంట గా చిత్రీకరించడం నేరం ​ఈ మైనర్ బాలిక మిస్సింగ్ కేసును కొంతమంది పెద్దలు ప్రేమ జంట వ్యవహారంగా చూపించడానికి ప్రయత్నించడం పట్ల పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ​మైనర్ బాలిక అదృశ్యం కేసును ప్రేమ వ్యవహారమని చెప్పడం చట్టపరంగా, నైతికంగా తప్పు. ఇది కేవలం చట్ట అవగాహన లేమి మాత్రమే కాదు, సమాజానికి ప్రమాదకరం, అని పోలీసులు స్పష్టం చేశారు. విచారణను ప్రశ్నించి, బాధితురాలి తల్లికి బాధ కలిగించే వ్యాఖ్యలు చేయడం సరైన పని కాదని హితవు పలికారు. ​ఫోక్సా నిబంధనలు అందరికీ హెచ్చరించారు.ఇది 18 ఏళ్ల లోపు బాలిక కేసు కాబట్టి ఫోక్స్ ఈ సమావేశంలో యస్.ఐ. రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :