నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గం లోని మూడు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో 550 మార్కులు, ఆపై సాధించిన విద్యార్థి, విద్యార్ధినులు, వాళ్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. పలువురు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందిస్తూ చదువు యొక్క ప్రాముఖ్యత ను పిల్లలకు అర్ధం అయ్యేలా వివరించారు. తదనంతరం ప్రతిభ కనబర్చిన ప్రతీ విద్యార్ధిని దుస్సలవా తో సత్కారం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తరువాత మొట్టమొదటిగా విద్యాశాఖలో పెను మార్పులు తెస్తూ ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను మంచి విద్యను అందించాలని ఆదేశించడం తో నేడు విద్యార్థులు మంచి మార్కులతో సాధించడం, రాష్ట్ర వ్యాప్తంగా సంచలంగా మారిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిఈఓ, ఎంఈఓ, ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News