నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 01 ః తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు ఈనెల ఆరవ తేదీ సోమవారం సచివాలయంలో బహిరంగ వేలం పాటలు జరుగుతాయని కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. ఉదయం వేలం పాటలకు పాటదారులు హాజరు కాకపోవడంతో ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు చెప్పారు. నేడు కోసువారిపల్లె వారపు సంత వేలం పాటలు సైతం వేలం పాట దారులు రాకపోవడంతో వాయిదా పడిందని తదుపరి వేలం పాటలు తేదీ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు పాటదారులు రూ 50వేలు ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని గతంలో పంచాయతీకి బకాయిలు ఉన్న వ్యక్తులు వేలం పాటలకు అనర్హులని ప్రకటనలో తెలిపారు
Reporter
Namitha News