నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 19 : రామసముద్రం ఎంపీపీ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి మేరీ కుసుమ కుమారి గారు రెండు నెలల క్రితం అనగా అక్టోబర్ 18వ తేదీ న అకాల మరణం చెందిన విషయం విధితమే, సదరు విషయం ను ఎంపీడీఓ జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపారు. మండలం లోని అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని వైస్ ఎంపీపీ వెంకటరమణ రెడ్డి అభ్యర్థన మేరకు ఇంచార్జ్ ఎంపీపీ గా విధులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఉత్తర్వులు రామసముద్రం ఎంపీడీఓ కు అందిన నేపథ్యంలో విషయం తెలుసుకొన్న వైసీపీ కార్యకర్తలు, స్థానిక వైసీపీ నేతలు వెంకటరమణ రెడ్డి కి అభినందనలు తెలుపుతున్నారు
Admin
Namitha News