నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 21 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గురువారం కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఎన్నికల విధులలో భాగంగా పర్యవేక్షిస్తూ టీఎన్ నాగిరెడ్డి, టిఎన్ నారాయణరెడ్డి కుటుంబాలకు చెందిన బంగ్లాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. టిఎన్ కుటుంబీకులు వేలాది ఎకరాలు నిరుపేదలకు భూములు పంపిణీ తో పాటు తంబళ్లపల్లెలోని ప్రతి కార్యాలయానికి ఉచితంగా భూములు ఇచ్చిన త్యాగదనులని, తంబళ్లపల్లె ప్రాంత ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు నాటి నుండి నేటి వరకు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను తాసిల్దార్ శ్రీనివాసులు కూలంకషంగా వివరించగా సెంట్రల్ టీం సభ్యులు నేటి ఆధునిక సమాజంలో నాటినుండి నేటికీ నిస్వార్ధంగా పేదల కోసం అంతటి సహాయం అందిస్తున్న టిఎన్ కుటుంబాలు భావితరాలకు ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు
Reporter
Namitha News