నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 16 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ మసీదు వీధిలోని నర్సరీ నిర్వాహక రైతు తుపాకుల వెంకటరమణ (59)కు ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తరలించడానికి ప్రయత్నించే లోపే మృతి చెందాడు. ఆయన మృతి తో ఆ నిరుపేద కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడం తో శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయనకు భార్యతో పాటు ఇరువురు కుమారులు ఉన్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News