Saturday, 12 September 2026 07:08:30 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

జనవరి 4వ తేదీన భూ పోరాట జిల్లా సదస్సును జయప్రదం చేయండి - సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప

జనవరి నెల 18వ తేదీన ఖమ్మం లో సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ

Date : 02 January 2026 08:04 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. . కొత్తకోట - జనవరి 02 : జనవరి నెల 18వ తేదీన ఖమ్మం లో సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ కు గౌరవార్థంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) మరియు భారత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ ఆదివారం రోజున బి.కొత్తకోట మండలం లోని బీరంగి గ్రామం టానామిట్ట వద్ద జరిగే భూ పోరాట జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి లు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని టానామిట్ట వద్ద సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ; పేదల సాగు మరియు నివాసంలో ఉన్న భూములకు పట్టాలు పంపిణీ చేయాలని,కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలుపై, అసైన్డ్ చట్ట సవరణపై ఈ యొక్క సదస్సులో చర్చించి పోరాట రూపకల్పన చేయడం జరుగుతుందని,ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల.ఈశ్వరయ్య,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు,వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు బి.కేశవరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ తదితర నాయకులు పాల్గొంటున్నారని భూ పోరాటాలే ప్రధాన అజెండాగా జరుగుతున్న ఈ యొక్క సదస్సుకు నియోజకవర్గంలోని వ్యవసాయ కార్మికులు,పార్టీ మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి.నారాయణస్వామి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి హరికుమార్,శంకర,లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :