నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 16 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండలో సోమవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి మహా కుంభాభిషేకం, వరుణయాగం నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లు విలేకరులకు తెలిపారు. తంబళ్లపల్లె ప్రాంతంలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావంతో రైతులు పంటలు పండక సాగునీరు తోపాటు కనీసం తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. మల్లయ్య కొండ మహాశివునికి కుంభాభిషేకం నిర్వహిస్తే ఖచ్చితంగా వర్షం కురుస్తుందని పెద్దల నమ్మకం. కుంభాభిషేకం, వరుణయాగం నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ ఈవో తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీసులు నడపాలని భక్తులు కోరుతున్నారు.
Reporter
Namitha News