Wednesday, 29 July 2026 09:13:22 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 మొందోస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

సి.యస్. మరియు ప్రధాన ఎన్నికల అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులకు SIR పై దిశానిర్దేశం

Date : 26 May 2026 08:07 PM Views : 53

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 ముందస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026) కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న సన్నాహక చర్యలపై మంగళవారం సాయంత్రం విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నమోదు అధికారులు (EROs), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs), బూత్ లెవల్ అధికారులు (BLOs) నియామకం, శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ మరియు పంపిణీ, BLO కిట్ల అందజేత, BLOలకు గౌరవ వేతనాల చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. అలాగే వాలంటీర్ల నియామకం, హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. వీసి అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ... ప్రత్యేక సవరణ ప్రక్రియను సమయపాలనతో పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో నమోదు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టి, ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, నియోజకవర్గ ఈఆర్వోలు, సంబంధిత రెవెన్యూ మరియు ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :