Monday, 14 September 2026 08:23:38 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం , తెప్పోత్సవం

Date : 06 November 2025 01:04 PM Views : 269

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 05 : అన్నమయ్య జిల్లా మండల కేంద్రం లోని అతి పురాతన చంద్రశేఖర స్వామి ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, దిగువపేట సర్కిల్ నుండి ఆలయం వరకు విద్యుత్ దీపాలు పచ్చని తోరణాలతో అలంకరణ చేశారు.ఆలయం ప్రధాన అర్చకులు బాలాస్వామి, రవి స్వామి ఉదయం స్వామి వారి ఆలయ శుద్ధి చేసి అభిషేకాలు అర్చనలు నిర్వహించి పలురకాల పుష్పాలతో స్వామి వార్లను అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.సాయంత్రం జ్వాలాతోరణం, అకాశదీపం,తెప్పోత్సవం సందర్బంగా ఆలయంలో భక్తులతో కిట కిట లాడాయి . వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం లో ఉత్సవ మూర్తులను మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అరటి పిల్లలు, విద్యుత్ దీపాలు, పలురకాల పుష్పాలతో అలంకరించిన తెప్ప పై శ్రీ పార్వతి సమేత చంద్రశేఖర స్వామి వార్లను కొలువుంచి, దివ్య పుష్కరిణిలో తె ప్పోత్సవ ఘట్టాన్ని కన్నులు పండువుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలా స్వామి, రవి స్వామి, స్వామి వారిని దర్శనం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే బజారు వీధిలో వెలిసిన ఆలయం చెంబకూరు, మూగవాడి గుట్టపాల్యం దగ్గర కొండ పై వెలిసిన శివాలయాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళ లు ఒక్క పొద్దుతో స్వామి వారి ఆలయ ప్రాంగణం లో మహిళలు దీపారాధన చేశారు.చంద్రశేఖర స్వామి ఆలయం లో బాలా స్వామి,రవిస్వామి గ్రామస్థులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు .చంద్రశేఖర స్వామి ఆలయంలో దీపోత్సవం, తెప్పోత్సవం సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది బందోబస్తూ నిర్వహించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :