నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 21 ః తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ టిటిడి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సర్వభూపాలుడు ఉదయం ముత్యపు పందిరి వాహనం, సాయంత్రం సింహవాహనంపై ఊరేగారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేక పూజలు, అర్చనలు, ధూప దీప నైవేద్యాలు అనంతరం ముత్యపు పందిరిపై స్వామివారిని మాడవీధుల్లో మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనల మధ్య ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని పలు రకాల పుష్పాలతో అలంకరించిన సింహ వాహనంపై స్వామివారు విహరించారు. తదుపరి పంచామృతం, చందనం పసుపులతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో టిటిడి అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి బృందం తో పాటు ఆలయ అధికారులు కృష్ణమూర్తి, నగేష్, మురళి స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News