నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 29 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన పౌరసరఫరాల గోడౌన్ పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తంబళ్లపల్లెలో నిత్యవసర సరుకుల గోడౌన్ లేక తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమయంలో పూర్తిగా బియ్యం, రేషన్ సరుకులు వర్షానికి తడిసి పనికిరాకుండా పోయేవి. అనంతరం పలు ప్రైవేట్ భవనాలలో నిత్యవసరాలు సరుకుల గోడౌన్ నిర్వహించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరిగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉద్యానవన శాఖ (సెర్ఫ్) ఉత్పత్తిదారుల సమైక్య భవనంలో నెలకు రూ 8 వేల అద్దె భవనంలో పౌరసరఫరాల గిడ్డంగి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో సెర్ఫ్ భవనం ఎదురుగా పౌర సరఫరాల గిడ్డంగి పనులు పూర్తయి సిద్ధమైంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నూతన పౌరసరఫరాల గిడ్డంగిని సద్వినియోగం పరచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News