నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 12 : పాఠశాలల విద్యార్థుల భద్రత కోసం జిల్లా ట్రాన్స్ పోర్టు కమిషనర్ అధికారుల ఆదేశాల మేరకు పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సుప్రియ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వాంచారు. పుంగనూరు పట్టణం లోని పలు స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ లైసెన్స్, వేగ నియంత్రణ పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు, మరియు అత్యవసర ద్వారాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీలలో ప్రధాన అంశాలు ప్రతి బస్సుకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్ నెస్ సర్టిఫికెట్, బ్రేక్లు, టైర్లు, హెడ్లైట్లు, మరియు వైపర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని స్వయంగా పరిశీలించారు. భద్రతా పరికరాలైన అగ్నిమాపక యంత్రం, ప్రథమ చికిత్స కిట్ బస్సులో అమర్చారా, అందులో ప్రథమ చికిత్స మెడిసిన్ అందుబాటులో ఉందా లేదా అంటూ తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, విండోలు సులభంగా తెరుచుకునేలా ఉన్నాయా లేవాని చూశారు.వేగ నియంత్రణ పరికరం,మరియు జీపీఎస్ పనితీరును తనిఖీ చేశారు.డ్రైవర్కు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందోనని,డ్రైవర్ కు గల అలవాట్లు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ హెవీ వెహికల్ లైసెన్స్ కాల పరిమితి ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎక్కే బస్ ఫిట్నెస్ను పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలని, బస్సులో తగినంత మంది సిబ్బంది (అటెండర్) ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు
Reporter
Namitha News