Monday, 08 June 2026 08:27:44 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం -- డి.యం.హెచ్.ఓ. లక్ష్మీనరసయ్య

Date : 04 February 2026 07:17 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం -- డిఎమ్హెచ్ఓ లక్ష్మీనరసయ్య క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయం నుండి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పై అవగాహనా సమావేశం నిర్వహించారు.‌ డిఎమ్హెచ్ఓ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనసైలి, ప్రవర్తన తో క్యాన్సర్ ను నియంత్రించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఏడాది దాదాపు 35 వేల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే గత ఏడాది నవంబర్ 15 నుండి ఇంటింటి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఎన్సీడి 4.0 నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎన్. సి. డి. ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శివప్రతాప్ మాట్లాడుతూ "ఒకే లక్ష్యం ఎన్నో కథలు" "మేమున్నామని మీకేమి కాదని" అని ఈ ఏడాది థీమ్ ను ఎంపిక చేశామన్నారు. గుట్కా, పోగాకు, మద్యపానం సేవించడం, ఎక్కువగా గర్భ నిరోధక మాత్రలు మింగడం వల్ల, వ్యాధినిరోధక శక్తి క్షీణిస్తుందన్నారు. కొన్ని జన్యు సంబంధ కారణాల వల్ల, ఊభకాయం వల్ల, క్రిమిసంహారక మందులు వాడటం, ఆహారంలో రసాయణాలు వాడటం వల్ల, వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 14ఏళ్లు నిండిన అమ్మాయిలకు భవిష్యత్ లో గర్భషయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఇమ్మ్యూనిటీ పెంచడానికి హెచ్. పీ. వి. వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, తొందరలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని, ఆరోగ్య కరమైన జీవనశైలీ పాటిద్దాం, ప్లాస్టిక్ ను నిషేదిద్దాం, క్యాన్సర్ ను నివారిద్దాం, క్యాన్సర్ పట్ల భయాన్ని వీడి అవగాహన పెంచుకుందాం, వదిలేద్దాం జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఉప్పు, చక్కర, మైదా, ఆయిల్, కారం తగ్గించుకుందాం క్యాన్సర్ ను నివారిద్దాం అంటూ నినాదాలు పట్టణ పురవీధుల్లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జ్ణానాంబికా డిగ్రీ కళాశాలలో ప్రపంచ కాన్సర్ దినం పై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక, ఏ. ఓ. మధుసూదన్ రెడ్డి, 104నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, డి. ఎమ్. ఓ. రామచంద్ర రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. కాన్సర్ పై అవగాహన ర్యాలీ చేస్తున్న వైద్యసిబ్బంది క్యాన్సర్ ను నివారిద్దామని ప్రతిజ్ఞ చేస్తున్న వైద్యసిబ్బంది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :