నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : అన్నమయ్య జిల్లా మదనపల్లె లో శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా డాన్స్ అకాడమీ స్కూల్ వ్యవస్థాపకుడు యువరాజ్ ఆధ్వర్యంలో బాల, బాలికలచే డాన్సులతో ఘనంగా బాలల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ జాతిని జాగృతం చేసే కళ అలాంటి కళ భారతీయ సాంప్రదాయ, జానపద నృత్యాల విశిష్టతను సమాజానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా నేటి తరం పిల్లలకు నృత్య కళలు నేర్చించాల్సిన బాధ్యత తల్లితండ్రలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బాల బాలిక తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News