నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జెఎన్టియూ అనంతపురం యూనివర్సిటీ టీమ్స్ కి విశ్వం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపిక అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జేఎన్టీయూ యూనివర్సిటీ అనంతపురం వాలీబాల్ మరియు బాస్కెట్బాల్ కు ఎంపిక జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ఎన్ బి కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో జేఎన్ టియూ అనంతపురం పరిధిలో జరిగిన వాలీ బాల్ పోటీలో విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ సిఎస్ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అబ్దుల్ మహమ్మద్ షమీర్ మరియు నంద్యాల ఆర్.జి.ఎం ఇంజనీరింగ్ కాలేజీ లోజరిగిన బాస్కెట్ బాల్ సెలక్షన్ లో విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ బి. టెక్ సెకండ్ ఇయర్ ఈఈఈ విద్యార్థి హేమంత్ కుమార్ యూనివర్సిటీ తరఫున ఆడే మెయిన్ టీమ్స్ కు ఎంపిక అయినట్లు తెలియజేశారు. ఇంకా కాలేజీ నందు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కళాశాల ఫీజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎం. మహేంద్ర రెడ్డి, ఆర్. రాజ్ కుమార్ మరియు ఏ. సురేష్ మాట్లాడుతూ నిరంతర శిక్షణ మరియు పట్టుదల ద్వారా విద్యార్థులు ఆటల పోటీలలో విద్యార్థులు విజయం సాధిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా కాలేజ్ మేనేజ్మెంట్ శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ టీఎస్ గౌస్ బాషా, అన్ని విభాగాల డీన్స్, హెచ్ఓడి లు మరియు విద్యాపకులు ఎంపికైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము ఈ బంగారు అవకాశాల్ని సద్వినియోగం పరుచుకుంటామని తెలియజేశారు.
Reporter
Namitha News