Monday, 14 September 2026 04:46:43 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సిహెచ్సి లోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి -డి.సి.హెచ్.ఎస్. లక్ష్మీకర్

Date : 25 May 2026 09:58 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : తంబళ్లపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని ఇన్ పేషెంట్లు పెరగడానికి కృషి చేయాలని డిసిహెచ్ఎస్ లక్ష్మీకర్ సూచించారు. సోమవారం ఆయన తంబళ్లపల్లి సిహెచ్సీని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులు, బాలింతల వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే యూనిట్, గోపి యూనిట్ పరిశీలించారు. ఆసుపత్రిలో హాజరవుతున్న ఓపి రోగుల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలు, రాత్రిపూట వైద్య నిర్వాహణ, రోగులకు అందిస్తున్న ఉచిత భోజనం సౌకర్యం తదితరాంశాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా రోగుల సంఖ్య పెరగకపోవడం పై అధ్యయనం చేస్తామని, త్వరలో పోస్టుమార్టం నిర్వహణకు చర్యలు చేపడతామని, చిన్న చిన్న వైద్య సమస్యలపై చీటికిమాటికి మదనపల్లి కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి లోపల ఎక్కడపడితే అక్కడ చెత్త బాక్సులు వేరాదని పారిశుధ్యం పాటించాలని ఆస్పత్రి పరిసరాలు దోమల నివారణతో పరిశుభ్రంగా ఉంచుకొని ఆహ్లాదకర వాతావరణం ఉండాలన్నారు. రాత్రిపూట వచ్చే డెలివరీ కేసులు, యాక్సిడెంట్ కేసులు వైద్యానికి డాక్టర్ కచ్చితంగా ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. ఆసుపత్రిలో డెలివరీలు పెంపుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి లో అందిస్తున్న సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించినట్లు తెలిపారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ తేజస్వి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :